Thursday, September 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంశ్రీలంకలో విషాదం.. ఏడుగురు బౌద్ధ సన్యాసులు మృతి

శ్రీలంకలో విషాదం.. ఏడుగురు బౌద్ధ సన్యాసులు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వాయువ్య శ్రీలంకలో విషాదం నెల‌కొంది. అటవీ ప్రాంతంలోని మఠం వద్ద కేబుల్‌తో పనిచేసే రైలు బండి బోల్తా పడి ఒక భారతీయుడితో సహా ఏడుగురు బౌద్ధ సన్యాసులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు గురువారం తెలిపారు. ఈ ఘటన బుధవారం రాత్రి కొలంబో నుండి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న నికావెరాటియాలో ఉన్న ప్రఖ్యాత బౌద్దారామం అయిన నా ఉయన అరణ్య సేనసనయలో జరిగింది. ఈ మఠం ధాన్య విహారయాత్రలకు ప్రసిద్ధి చెందింది. మరణించిన ఏడుగురు సన్యాసుల్లో ఒక భారతీయుడు, రష్యన్‌, రొమేనియన్‌ జాతీయులు ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -