- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గత రెండేళ్లుగా పాలస్తీనాను దురాక్రమించడానికి ఇజ్రాయిల్ సైన్యం రోజూ దాడులకు పాల్పడుతూనే ఉన్నది. ఈ దాడుల వల్ల ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. బుధవారం అల్ – అహ్లీ స్టేడియంపై ఇజ్రాయిల్ సైన్యం దాడి చేయగా.. 85 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజాపై కొనసాగుతున్న దాడుల్ని ప్రపంచ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాడుల్ని ఆపాలని ఐక్యరాజ్యసమితి కూడా ఇజ్రాయిల్ని హెచ్చరించింది. అయినప్పటికీ ఇజ్రాయిల్ దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది.
- Advertisement -