- Advertisement -
– సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దు : ఎస్బీఐ
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తల నేపథ్యంలో ఏటీఎంలు మూతపడుతాయని సోషల్ మీడియాలో వస్తోన్న పుకార్లను నమ్మొద్దని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. ఇతర ప్రముఖ బ్యాంక్ల సేవలు సంపూర్ణంగా పని చేస్తాయని పేర్కొంది. డిజిటల్ సేవలు సజావుగా పని చేస్తున్నాయని వెల్లడించింది. దృవీకరించని సమాచారాన్ని నమ్మకూడదని సూచించింది. ఇదే విషయమై పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ సింథ్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టతను ఇచ్చాయి.
- Advertisement -