- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న హౌరా ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో రైలు నిలిచిపోయింది. ప్లాట్ఫామ్-1పై గంటకుపైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుక్కొంటున్నారు. మరో ఇంజిన్ను తెప్పించేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
- Advertisement -