- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ శుక్రవారం ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో ఈడీ అధికారులు (ED officials) సోదాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మున్సిపల్ ఉద్యోగాల అక్రమ నియామకాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రాష్ట్ర మంత్రి సుజిత్ బోస్ నివాసం సహా మొత్తం 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సోదాలు ప్రధానంగా బోస్ 2010–2021 కాలంలో సౌత్ డమ్ డమ్ మున్సిపాలిటీలో ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో అక్రమ నియామకాల్లో పాలుపంచుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్నాయి.
- Advertisement -