నవతెలంగాణ-హైదరాబాద్: అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత పతాకం రెపరెపలాడింది. భారత్కు చెందిన షెర్రీ సింగ్ ను మిసెస్ యూనివర్స్ 2025 కిరీటం వరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్రలో తన పేరును ఆమె లిఖించుకున్నారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో నిర్వహించిన 48 వ ఎడిషన్ పోటీలో ప్రపంచవ్యాప్తంగా షెర్రీ సింగ్ 120 మందితో పోటీపడి కిరీటాన్ని దక్కించుకున్నారు. తొమ్మిదేండ్ల క్రితం వివాహమై ఒక కుమారుడు ఉన్న షెర్రీ సింగ్ విజేతగా నిలిచిన తర్వాత ‘ ఈ విజయం కేవలం నా ఒక్కదానిదే కాదు. హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదీ. బలం, దయ, పట్టుదల మహిళ నిజమైన అందానికి నిదర్శనం అని నేను ప్రపంచానికి చూపాలనుకుంటున్నాను ‘ అని ఆమె పేర్కొన్నారు. తనను విజేతగా ప్రకటించిన తర్వాత ఆమె భారత జెండాను చేతబట్టి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చరిత్రాత్మకమైన ఈ విజయం భారత్ను గర్వపడేలా చేసిందని మిస్ యూనివర్స్ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు. ఆమెకు ఇన్స్టాలో 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మిసెస్ యూనివర్స్గా షెర్రీ సింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES