Friday, August 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబిహార్‌ రాజధాని పట్నాలో ఉద్రిక్తత

బిహార్‌ రాజధాని పట్నాలో ఉద్రిక్తత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బిహార్‌ రాజధాని పట్నాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్నాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకోవడంపై కోపోద్రిక్తులైన ఆందోళనకారులు 3 పోలీసు జీపులకు నిప్పుపెట్టడంతో పాటు, వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. మృతదేహాన్ని తరలించిన పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. దాడులకు పాల్పడినవారిని వీడియోల ఆధారంగా గుర్తిస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -