నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్లోని చర్సడ్డాలో 72 ఏండ్ల వయస్సులో అభంశుభం తెలియని మైనర్ బాలికతో పెండ్లికి సిద్ధమయ్యాడో వృద్ధుడు. తండ్రి ఒత్తిడితో వృద్ధుడిని వివాహం చేసుకోవడానికి ఆ 12 ఏండ్ల చిన్నారి ఒప్పుకున్నది. నిఖ్ఖాకు అంతా రెడీ అయిన సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇకేముందు ఆ తండ్రి తప్పించుకోగా.. వృద్ధ పెండ్లి కొడుకు అడ్డంగా దొరికిపోయాడు. అతనితోపాటు పెండ్లి జరించడానికి వచ్చిన నిఖ్ఖా ఖ్వాన్ను కూడా అరెస్టుచేశారు. డబ్బుకు ఆశపడిన బాలిక తండ్రి ఆలమ్ సయీద్.. రూ.5 లక్షలకు (పాక్ కరెన్సీ) ఆమెను వృద్ధుడికి అమ్మేశాడని పోలీసులు తెలిపారు. పెండ్లి కొడుకుని పట్టుకున్నామని, ఆలమ్ కోసం వెతుకుతున్నామని చెప్పారు. వారిద్దరితోపాటు నిఖ్ఖా ఖ్వాన్పై చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు నమోదుచేశామన్నారు.