మోసానికి పాల్పడిన వ్యక్తి పై కేసు నమోదు

– రాగుల రాములుకు సంబంధించిన బాధితులు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలి
– సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
నవతెలంగాణ – సిరిసిల్ల
అవసరానికి డబ్బులు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకొని, అదే ఇంటిని బ్యాంకులో పెట్టి 20 లక్షల రూపాయల రుణం తీసుకొని,ఇచ్చిన డబ్బులు కట్టిన తర్వాత ఇంటిని రిజిస్ట్రేషన్ చేయకుండా మోసం చేసిన రాగుల రాములు పై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి  తెలిపారు.
డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం…  సిరిసిల్ల పట్టణ పరిధిలోని  సంజీవయ్య నగర్ కి చెందిన రాకం పెద్ద బాబు అనే వ్యక్తి తన అవసరానికి సిరిసిల్ల పట్టణానికి చెందిన రాగుల రాములు అనే వ్యక్తిని 3లక్షలు అడుగగా, రాగుల రాములు తన పేరు మీద రాకం పెద్ద బాబు ఇంటిని రిజిస్ట్రేషన్ చేపిస్తేనే డబ్బులు ఇస్తానని చెప్పగా అందుకు ఒప్పుకొని రాగుల రాములు పేరు మీద బాధితుడు  ఇంటిని 2017 లో రిజిస్ట్రేషన్ చేశాడు బాధితుడు పెద్ద బాబు 3 లక్షలు తీసుకొన్న తర్వాత  రాగుల రాములు యాక్సిస్ బ్యాంకు లో అ ఇంటి దస్తావేజులు పెట్టి  20 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఈ విషయమై  రాకం పెద్ద బాబు కు తెలిసి రాగుల రాములును అడుగగా ఏమి చేసుకుంటావో చేసుకోమని, ఇచ్చిన డబ్బులకి మిత్తీ కట్టమనగా పెద్ద బాబు మిత్తి కట్టిన తర్వాత 47 రోజులకు ఇంటిని పెద్ద బాబు పేరు మిద రిజిస్ట్రేషన్ చేపిస్తానని చెప్పి 3 లక్షలు , మిత్తి తీసుకున్న రిజిస్ట్రేషన్ చేయకుండా కాలం గడుపుతూ మోసం చేశాడని రాకం పెద్ద బాబు పిర్యాదు మేరకు రాగుల రాములు పై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో చిటింగ్ కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ  తెలిపారు. రాగుల రాములు కి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉంటే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని డిఎస్పీ  తెలిపారు.

Spread the love