వరద కాలువలో మృతదేహం లభ్యం

నవతెలంగాణ – మోర్తాడ్
మండల కేంద్రంలోని గ్రామ శివారులో గల వరద కాలువలో శనివారం మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. వర్ధకాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై అక్కడికి వెళ్లి పరిశీలించగా మండల కేంద్రానికి చెందిన కూరగాయల సుధాకర్ 34 గత కొంతకాలం నుండి మధ్యాహ్నం తాగడానికి డబ్బులు లేక వర్ధకాలువలో శుక్రవారం దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. సుధాకర్ భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
Spread the love