విద్యుత్తు జీరో బిల్లులతో ఎంపీటీసీ తీగల స్వప్న సమ్మయ్య 

– కరెంట్ బిల్లు జీరో రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు 

– ఎంపీటీసీ తీగల స్వప్నసమ్మయ్య 
నవతెలంగాణ – రామగిరి 
కరెంట్ బిల్లు జీరో రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మండలంలోని నాగ పల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ తీగల స్వప్న సమ్మయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం  పేదల దగ్గర కరెంట్ బిల్లులు ముక్కు పిండి వసూలు చేసేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా  విద్యుత్తు బిల్లులు మార్చి 1, నుండి జీరో వస్తున్నాయని జీరో రానివారు అధైర్య పడకుండా మీటర్ సర్వీస్ నెంబర్, అదే విధంగా ఆధార్ కార్డు, ప్రజాపాలన రిసిప్ట్ తీసుకొని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో  సంప్రదించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love