స్నేహితుల ఆత్మీయ సమ్మేళనం..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి

మండలంలోని ఉప్లూర్ లో ఆదివారం గ్రామానికి చెందిన స్నేహితులంతా కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామానికి చెందిన పలువురు  ఉప్లూర్  ఫ్రెండ్స్ పేరుతో వాట్సప్ గ్రూపును నిర్వహించుకుంటున్నారు. ఈ గ్రూపులో గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వారు, వ్యాపారస్తులు, ఇతరత్రా పనులు కొనసాగిస్తున్న వారంతా కలిసి సుమారు 200 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఎక్కడెక్కడో స్థిర పడ్డ వారంతా కలిసి ఒకచోట కలుసుకోవాలన్న ఆలోచనతో ఆదివారం గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఒకచోట కలిశారు. దశాబ్దల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం పట్ల కొందరు భావోద్వేగానికి లోనయ్యారు. ఒకరినొకరు తమ తమ జీవిత అనుభవాలను పంచుకోవడం ద్వారా ఆత్మీయ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. గ్రామానికి చెందిన ఎందరో  దశాబ్దాలుగా ఒకరికొకరు కలుసుకోకుండా ఉన్న వారంతా ఉప్లూర్ ఫ్రెండ్స్  వాట్సాప్ గ్రూప్ పేరుతో  ఒక చోట చేరడం పట్ల వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకరి అనుభవాలను ఒకరు పంచుకొని,  కష్టనష్టాలను కుటుంబ స్థితులను ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. అంతా కలిసి ఒకచోట చేరి గ్రూప్ ఫోటోలు దిగారు. అనంతరం సామూహిక భోజనాలు చేశారు.తరచూ ఇలాంటి  సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామస్తులతో ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగించేందుకు ఆస్కారం ఉంటుందని సందర్భంగా పలువురు వ్యాఖ్యానించారు.
Spread the love