ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ – మోర్తాడ్

మండల కేంద్రంలోని ఆర్ జి జి ఫంక్షన్ హాల్ లో ఆదివారం 25 సంవత్సరాల సందర్భంగా సిల్వర్ జూబ్లీని పూర్వ విద్యార్థులు నిర్వహించుకున్నారు. 98 99 సంవత్సరం సంబంధిత పదో తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. పాఠశాల లో జరిగిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులను స్మరించుకున్నారు. నాటి విద్యాబోధన తోనే నీటి ఉన్నత స్థాయికి ఎదగడం జరిగిందని గురువర్యులను కొనియాడారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. 25 సంవత్సరాల అనంతరం విద్యార్థులందరూ కలవడం తమకెంతో సంతోషంగా ఉందని విద్యార్థులను తాము మర్చిపోయిన తమను మాత్రం మర్చిపోకుండా ఆహ్వానాన్ని పలకడం తమకు ఎంతో గర్వమని ఉపాధ్యాయులు అన్నారు. నేటితో అంతం కాకుండా పతినిత్యం ఈ స్నేహం పూర్వ సమ్మేళనం పతినిత్యం ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
Spread the love