మహానీయునికి దక్కిన మహా గౌరవం

– బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీపాద రావు
–  తండ్రి బాటలో తనయులు శ్రీధర్‌బాబు, శ్రీనుబాబు
నవతెలంగాణ – ముత్తారం
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ స్వర్గీయ శ్రీపాద రావు జయంతి వేడుకలను తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడంతో మహానీయునికి మహా గౌరవం దక్కింది. 1935 సంవత్సరంలో మార్చి 2న కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందినా మౌళి పటేల్‌ రాధాకిష్టయ్య కమలా బాయి దంపతులకు జన్మించారు దుద్దిళ్ల శ్రీపాద రావు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్‌లో పుట్టిన ఆయన ప్రాథమిక విద్య ధన్వాడ గ్రామంలో చేసి, ఎస్‌ఎస్‌సి వరకు మంథనిలోని బావ సువర్ణ చంటయ్య ఇంట్లో ఉండి పూర్తిచేశాడు. ఇంటర్‌, డిగ్రీ హైదరాబాద్‌లో చేసిన తరువాత ఆదిలాబాద్‌ జిల్లాలో పంచాయతీ ఇన్స్పెక్టర్‌గా ఉద్యోగం కొన్ని రోజులు చేశారు. ఆ తరువాత నాగపూర్‌లో న్యాయవాదిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఎల్‌ఎల్‌బి పూర్తి చేసి ప్రాక్టీసు చేశారు. తండ్రి మరణాంతరం స్వంత ఊరికి వచ్చిన శ్రీపాద వ్యవసాయమే వృత్తిగా చేసుకొని, గ్రామంలోనే ఉన్నాడు.
రాజకీయ ప్రస్థానం: కొన్ని రోజుల తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామం నుండి సర్పంచ్‌గా పోటీ చేయాలని ప్రజలు ఒత్తిడి చేశారు. నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న శ్రీపాద రాజకీయాల్లోకి అడుగిడాలని స్నేహితులు, హితులు ప్రోత్సాహించారు. ఆ దిశగా అడుగులు వేస్తూ పోటి చేసి మొదటిసారి సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు శ్రీపాద రావు. వరుసగా మరో మారు ఆయనకే ప్రజలు మద్దతు పలకడంతో రెండవ సారి కూడా ఆయన ఎన్నికయ్యారు. మహాదేవపూర్‌ సమితి అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఎల్‌ఎంబి ఛైర్మన్‌ పదవికి మంథని నుండి గెలిచాడు. ఆయన రాజకీయ ఎదుగుదలకు ఎల్‌ఎంబి బ్యాంకు చైర్మన్‌ ఎన్నిక ఎంతో సహకరించింది. దీంతో పూర్తిగా నియోజకవర్గానికే ఆయన సుపరిచితమయ్యాడు. పదవివస్తే ముఖంచాటు చేసుకునే నాయకులకు భిన్నంగా ఆయన ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్ట, నష్టాలలో పాలు పంచుకొని ప్రజానాయకునిగా ఎదిగాడు. 1984 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ నుండి మొదటి సారిగా ఎమ్మెల్యే పోటి చేసే అవకాశం లభించింది. అప్పుడే పురుడు పోసుకున్న తెలుగు దేశం పార్టీ ప్రభావం, ఎన్టిఆర్‌ ప్రభంజనం ముందు శ్రీపాదరావు విజయం సాదించగలుగుతాడా అనే అంశంఫై స్వపార్టీ, విపక్షాలలో చర్చ జరిగింది. తెలుగుదేశం, సంజయ్‌ విచార మంచ్‌ మధ్య ఎన్నికల ఒప్పందం కారణంగా మంథని శాసనసభ నియోజకవర్గం నుండి పోటిగా విచార మంచ్‌ నుండి చంద్రుపట్ల రాజి రెడ్డి దిగారు. వీరిద్దరి మధ్య గట్టి పోటి నెలకొనగా చివరకు శ్రీపాదరావు విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసన సభ్యులుగా ఎన్నికైన ఆయనకు శాసనసభ స్పీకర్‌గా అన్ని పార్టీల మద్ధతుతో పదవి నదిష్టించారు. ఆ పదివికి వన్నె తెచ్చారని ఎంతోమంది ప్రముఖులు, రాజకీయా విశ్లేషకులతో ప్రశంశలు పొందారు. ఒకవైపు స్పీకర్‌ పదవీ బాధ్యతతో నిర్వహిస్తునే మరోవైపు తన స్వంత నియోజకవర్గ ప్రజలను మాత్రం మరిచిపోకుండా, మరింత దగ్గరయ్యారు. విమర్శలకు వెరవకుండా, పొగడ్తలను లెక్క చేయకుండా, అభివృదిపై దఅష్టి సారిస్తూ ముందుకు కదిలారు. మంథని ప్రాంతంలో అభివృద్ధి అంటే శ్రీపాద రావు స్పీకర్‌ ఉన్న సమయంలోనే అని చెప్పుకోవచ్చు. 1994 ఎన్నికల ముందు నక్సల్స్‌, పోలీసుల మధ్య జరిగిన ప్రత్యేక్ష పోరు తీవ్రంగా ప్రభావం చూపింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో శ్రీపాదరావు పరాజయం పాలయ్యాడు. అయిన ఓటమి పాలయిన ప్రజలకు మాత్రం దూరం కాలేదు. వారి మధ్య లోనే ఉంటూ వారికి తన శక్తి మేరకు సేవ చేస్తూనే ఉంటూ వచ్చాడు. పాలకపక్షం, ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి శాసన సభ్యులు రాంరెడ్డి ఫై కనీసం పల్లెత్తు మాట, విమర్శ కూడా చేయకుండా హుందాగా వ్యవహరించి, తన ప్రజాభిమాన్ని మరింత చూరగొన్నారు. ఈక్రమంలో ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయనను మఅత్యువు నక్సల్స్‌ రూపంలో కబళించింది. 1999 ఏప్రిల్‌ 13న మహాదేవపూర్‌ మండలం అన్నారంకు తన అనుచర వర్గంతో వెళ్లి వస్తున్న క్రమంలో మార్గ మధ్యంలోని అడవుల్లో ఆయన వాహనాన్ని నక్సల్స్‌ ఆపివేసి, ఆయనతో మాట్లాడాలని చెప్పి లోపలి తీసుకెళ్ళి కరుకు తుపాకి తూటాలతో విగత జీవున్ని చేశారు. ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఎన్నడు అపకారాన్ని తలపెట్టని నాయకున్ని నిష్కారణంగా హతమార్చిన నక్సల్స్‌పై విమర్శలు గుప్పు మన్నాయి. రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ప్రజల కోసం తుపాకులు పట్టినట్లు చెప్పుకొనే నక్సల్స్‌ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం ప్రతి ఒక్కరు ప్రత్యేక్షంగా విమర్శించారు. అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఖండిరచారు. కన్నీటి పర్యంతమై ఆయన అంత్య క్రియల్లో సైతం పాల్గన్నారు. ఆయన మరణించిన.. ఇప్పటికి ప్రజల హఅదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు… విధాత ఆ ఉన్నత ప్రజా నాయకునికి హఅదయ పూర్వక నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించడం పట్ల అన్ని ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. శ్రీపాద రావు ఆశయ సాధనలో బాటలో ఇప్పుడు ఆయన తనయులు ముంథని నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్రీధర్‌బాబు ఇప్పటికీ మంథని నియోజక వర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెండవ సారి మంత్రిగా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. శ్రీనుబాబు శ్రీపాద ట్రస్ట్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తూ మంథని నియోజక వర్గంలో పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
Spread the love