జిల్లా ఎస్పీకి ఘన సన్మానం..

నవతెలంగాణ – సిరిసిల్ల
ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ శాఖ అధికంగా 676 యూనిట్ల రక్తం అందించి ప్రథమ స్థానం లో నిలవడంతో జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ను రాజన్న రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు శనివారం ఘనంగా సన్మానించారు. జిల్లాలో 2023 సంవత్సరంలో జిలాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అధికంగా 676 యూనిట్ల రక్తం అందించి తలసేమియా, సికిల్ సెల్, రక్తహీనతతో బాధపడె అంతేకాకుండా ప్రాణాపాయ స్థితి నుండి ఆదుకున్నందుకు గాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎస్ పి ని అభినందించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  ఉపాధ్యక్షులు ప్రయాకర్ రావు,  వేణు కుమార్ జిల్లా కోశాధికారి బుడిమె శివప్రసాద్ ఈసీ మెంబర్ సంగీతం శ్రీనివాస్ సభ్యులు ఇరుకుల్ల భాస్కర్ పలుగొన్నారు.

Spread the love