శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి..

– జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ
నవతెలంగాణ – సిరిసిల్ల
జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్,జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యఅతిథిగా హాజ‌రై జాతీయ జెండాను ఆవిష్క‌రించి జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు‌ , సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుయజేసి,శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు.తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీస్ శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని ఎస్పీ గారు కోరారు. అనంతరం విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ సేవ పథకం, సేవా పథకం పొందిన సిబ్బందికి పథకాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రచారి,సర్వర్ ఆర్.ఐ లు యాదగిరి, రమేష్, సి.ఐ లు రఘుపతి, శ్రీనివాస్,వీరప్రతాప్, శ్రీనివాస్ , ఎస్. ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love