పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
రుద్రవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. 2003, 2004 బ్యాచ్ కి చెందిన విద్యార్థులు, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు చుక్కయ్యను విద్యార్థిని, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయుడు చుక్కయ్య మాట్లాడుతూ మీరు చేసే ఉద్యోగాలలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love