జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైన విద్యార్థి ..

Student selected for national archery competitionనవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని సిద్దరామేశ్వరనగర్ గ్రామానికి చెందిన అకుల్ జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యాడు. ఆదివారం కొల్లూరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటిల్లో అండర్-12 విభాగంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ చూపి జాతీయ స్థాయి కి ఎంపికైనట్లు కోచ్ ప్రతాప్ దాస్ తెలిపారు. గత 2 సంవత్సరాలుగా అకుల్ దోమకొండ గడికోటలో కోచ్ ప్రతాప్ దాస్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడు. జాతీయస్థాయి కి అకుల్ ఎంపిక అవ్వడం పట్ల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రథమ ప్రతిభ కనబరిచి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Spread the love