తనను చంపేస్తాడనే భయంతో భర్తను చంపిన భార్య

నవతెలంగాణ – ధర్మసాగర్
మద్యానికి బానిసైన క్యాతంపల్లి గ్రామానికి చెందిన మొడెం రమేష్ (36) కూలి మద్యం మత్తులో  భార్యను కొట్టి చంపుతానని బెదిరించడంతో భార్య కర్రతో కొట్టి చంపిన ఘటన శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్యాతంపల్లి గ్రామానికి చెందిన మూడేం ఎఫ్సీఐ కూలిగా విధులు నిర్వహిస్తూ నిత్యం మద్యం సేవిస్తూ రోజు తన భార్యను వేధిస్తుండగా,  01.06.2024 9:30 గంటలకు రమేష్ తన భార్య పిల్లలను, అత్తను బాగా కొట్టి చంపుతానని బెదిరించగా ఆ రాత్రి వారి ఇంటి పక్కనే ఉన్న ఒక ఇసుక కుప్పపై ఉండి తలదాచుకోవడం జరిగిందని,అదే రాత్రి అసహనానికి లోనైనా భార్య తన భర్త బ్రతికి ఉంటే ఎలాగైనా చంపుతాడని భయభ్రాంతులకు గురైన మోడెం రమేష్ భార్య  మోడం స్వాతి,తన తల్లి అటికం లక్ష్మి సహాయంతో పెద్ద కర్రతో తలపై గట్టిగా కొట్టి చంపినట్లు వివరించారు. మృతునికి 10 సంవత్సరాల పాప, ఐదు సంవత్సరాల బాబు ఉన్నారని తెలిపారు. మృతుని  సోదరుడు మోడం వీరేశం దరఖాస్తు ఇవ్వగా మోడం స్వాతి మరియు స్వాతి తల్లి అటికం లక్ష్మి పై నమోదు చేసుకొని దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు ధర్మసాగర్ ఎస్ హెచ్ ఓ మహేందర్ తెలిపినారు.
Spread the love