ఇంకా రిపోర్ట్స్ కూడా రాలేదు..మీడియాపై నటి హేమ సీరియస్

నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ నటి హేమ మీడియాపై ఫైర్ అయ్యారు. బెంగూళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాననే అనుమానంతో పోలీసులు తన బ్లడ్ శాంపిల్స్‌ను ఇవాళే తీసుకున్నారని, ఇంకా దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా రాలేదని.. అప్పుడే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు మీడియాలో ఎలా ప్రచారం చేస్తారని సీరియస్ అయ్యారు. డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలో పాజిటివా.. నెగిటివా..? అన్నది తేలక ముందే తాను డ్రగ్స్ తీసుకున్నట్లు డిసైడ్ చేశారని మీడియాపై చిందులేశారు. కాగా, బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి హేమను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెడికల్ టెస్ట్‌లు పూర్తై బయటకు వస్తోన్న సమయంలో పై విధంగా మీడియాపై హేమ సీరియస్ అయ్యారు. ఇక, హేమను పోలీసులు రేపు (మంగళవారం) మేజిస్ట్రేట్ ముందు హాజరపర్చనున్నట్లు సమాచారాం.

Spread the love