టీఎస్ పీజీఈసెట్లో 11వ ర్యాంక్ సాధించిన అడవీ శ్రీరాంపూర్ విద్యార్థి

నవతెలంగాణ – ముత్తారం

ముత్తారం మండలం అడవీ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దుబాసి మాధవి రమేష్ (పోలీస్ కాని స్టెబుల్, మంథని పోలీస్ స్టేషన్) కుమారుడు దుబాసి నిఖిల్ కృష్ణ టిఎస్పిజిసెట్ పరీక్ష ఫలితాల్లో 11వ ర్యాంక్ సాధించాడు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీ పరీక్షల్లో 11వ ర్యాంక్ సాధించి న సందర్భంగా దుబాసి నిఖిల్ కృష్ణను, అతని తల్లిదండ్రులు దుబాసి మాధవి రమేష్ ను లను గ్రామస్తులు అభినందించారు. నిఖిల్ కృష్ణ 2020 జెఇఇ మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించి, ఎన్ఐటి ఆంధ్రప్ర దేశ్ తాటిపల్లి గూడెంలో బయోటెక్నాలజీ ఇంజనీరింగ్లో లో పట్టా పొందాడు. ఉన్నత చదువులు అభ్య సించడానికి టిఎస్పిజిఇసెట్ పరీక్ష రాసి రాష్ట్ర వ్యాప్తంగా 11వ స్థానాన్ని కేవసం చేసుకున్నాడు.
Spread the love