మొక్కజొన్న పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారి

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని మతు సంగెం, వండ్రికల్ గ్రామాలలోని మొక్క జొన్న, జొన్న,శెనగ పంటలను జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్క జొన్న మరియు జొన్న పంటలలో ప్రస్తుతం కాండం తొలుచు పురుగు,కత్తెర పురుగు వున్నట్లు గమనించటం జరిగింది వీటి నివారణ కోసం కార్బోఫ్యురాన్ 3% CG గుళికలు 3 కే జిలు ఎకరామొక్కజొన్న పంట సుడులలో వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు, అదే విధంగా ఎమ్మామెక్టిన్ బెంజోఏట్ 5% SG 100 గ్రాములు ఎకరానికి లేదా క్లోరాన్ ట్రనిలిప్రోల్ 18.5%SL 80-100 మీ లి ఎకరానికి లేదా క్లోరంత్రిప్రోల్ 10%+ లాంబ్డా సహలోత్రిన్ 5 zc 100 మీ లి ఎకరానికి పిచికారి చేసి మంచి ఫలితాలు పొందవచ్చు అని ఆమె తెలిపారు. ప్రస్తుతం శెనగ పంటలో ఎండు తెగులు వున్నట్లు గమనించటం జరిగింది దీని నివారణ కోసం మొదట ట్రైకో డర్మా తో విత్తేటప్పుడు 5 గ్రాములు కేజీ విత్తానానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి , అదే విధంగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క మొదలు తడిచే విధంగా డ్రెంచింగ్ చెయ్యటం ద్వారా కొంత వరకు నివారించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్ , ఏ ఈ ఓ లు షోయబ్ అహ్మద్ , విఘ్నేష్ మరియు రైతులు పాల్గొన్నారు.
Spread the love