పూర్వ విద్యార్థుల సమ్మేళనం..

నవతెలంగాణ – చండూరు
స్థానిక  జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి విద్యార్థులు  2005-06పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వసమ్మేళనం చండూరు ఓ ఫంక్షన్ హాల్ లో   ఘనంగా  నిర్వహించారు. అప్పటి జ్ఞాపకాలను ఒకరికొకరు స్మరించుకుంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఉపాధ్యాయులను జ్ఞాపకాలు అందించి, శాలువలతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం విందు భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తెలుగు పండిట్ గిరిధర్ రావు, ఇంగ్లీష్ టీచర్  భాస్కర్ రెడ్డి,  , గణితం  ప్రభాకర్,కావేరి, హిందీ పండిట్ శ్రీలక్ష్మి విద్యార్థులు పరమేశ, అశోక్ , భాస్కర్ , విజయ్ రాజు, రమేష్, వెంకన్న, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love