తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారికి అండగా అంబేద్కర్ సంఘం

నవతెలంగాణ – రాయపర్తి
మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన దంపతులు ఐత యాకయ్య, కొమరమ్మ అనారోగ్య సమస్యలతో మృతి చెందగా వారి కుమార్తె రేణుక అనాథగా మారింది. దాంతో అంబేద్కర్ సంఘం సభ్యులు రేణుకకు కొండంత అండగా నిలిచారు. దాతల సహకారంతో 70 వేల రూపాయల ఆర్థిక విరాళాన్ని సేకరించారు. రేణుక పేరుపై బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేశారు. సోమవారం పెద్దల సమక్షంలో చిన్నారికి ఫిక్స్ డిపాజిట్ బాండ్ పేపరును అందజేశారు. ఆర్థిక సహాయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పీఎస్సీఎస్ చైర్మన్ కుందూరు రామచంద్రారెడ్డి చిన్నారి రేణుకకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. రానున్న రోజుల్లో సైతం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసి ఐత రాంచందర్, దళిత రత్న అవార్డు గ్రహీతలు ఐత యాకయ్య, ఐత మల్లేష్, ఐత సంపత్, గడ్డం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love