జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి

నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా బుధవారం ఐఏఎస్‌ ఆమ్రపాలి కాట బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీల నేపథ్యంలో జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో ఆమ్రపాలి కాటకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రోనాల్డ్‌ రోస్‌ నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్‌ ఆమ్రపాలిని జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్‌ జోనల్‌ కమిషనర్‌ హేమం త్‌ కేశవ్‌ పాటిల్‌, కూకట్‌ పల్లి జోనల్‌ కమిషనర్‌ అపూర్వ్‌ చౌహాన్‌, శేరిలింగంల్లి జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌ రెడ్డిలు కమిషనర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

Spread the love