నవతెలంగాణ – తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని పాత గ్రామంలో మట్టి ట్రాక్టర్లు అతివేగంగా వెళ్లడం వలన ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ట్రాక్టర్ బోల్తాపడింది. అయినా ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. మూలమలుపుల వద్ద ట్రాక్టర్లను అతివేగంగా నడపడం వల్ల ట్రాక్టర్ బ్లోల్తా పడింది. నందపురం నుండి తిరుమలగిరి పాత గ్రామంలో ట్రాక్టర్లు అతివేగంగా నడపడం వల్ల ఈ సంఘటన జరిగింది.