అంజమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

నవతెలంగాణ – మునుగోడు
మండల కేంద్రానికి చెందిన వట్టికోటి అంజమ్మ  గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై సోమవారం సాయంత్రం మృతిచెందగా మునుగోడు మండలంలోని పలువురు నాయకులు మంగళవారం ఆమె మృతి దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ రూ.5 వేలు, కాంగ్రెస్ మండల నాయకులు , మాజీ వార్డు సభ్యులు ముచ్చపోతుల శ్రీనివాసు 5 వేల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి, మండల నాయకులు దుబ్బ ప్రభాకర్, రేవెల్లి సైదులు, రేవెల్లి మల్లేష్, శ్రీను, సైదులు, శంకరయ్య, వెంకన్న  తదితరులు పాల్గొన్నారు.
Spread the love