బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్..

నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన అంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రకాశ్ ముదిరాజ్ వరంగల్ జిల్లాకు చెందిన నాయకుడు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు బండ ప్రకాశ్ ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Spread the love