నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్రంలోని అల్పసంఖ్యాక వర్గాల వారు విదేశాలలో పై చదువుల నిమిత్తం ముఖమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆగస్టు 01 నుండి డిసెంబర్ 31/2023 కాలంలో (ఫాల్ సీజన్) అడ్మిషన్ తీసుకొని అర్హత కలిగిన అభ్యర్ధులు www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి తెలిపారు.విద్యార్ధుల తల్లితండ్రుల వార్షిక ఆదాయo రూ. 5 లక్షల లోపు ఉండాలని విద్యార్థిని విద్యార్థుల వయస్సు 35 సం. ల కు మించకుండా ఉండాలని అన్నారు. ఇ పథకo క్రింద ఎంపిక చేయబడిన ప్రతి విద్యార్ధికి స్కాలర్ షిప్ ఆర్ధిక సహాయo కింద రూ. 20,00,000(ఇరవై లక్షలు) రెండు విడుతలలో చెల్లిస్తారని తెలిపారు. అలాగే విమాన ప్రయాణ చార్జీలు రూ. 60,000(అరవై వేలు) మించకుండా చెల్లించడం జరుగుతుంది పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్ లైన్ నందు తేది 20.03.2024 సా. 5.00 గంటల వరకు నమోదు చేసుకోవాలి అని.ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తులను మూడు జతల జిరాక్స్ పేపర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రూం నంబర్ ఎఫ్ –05 లో గల మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయములో అందజేయాలని కోరారు. ఇతర పూర్తి వివరాలకు ఆన్ లైన్ వెబ్ సైట్ లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధికారి కార్యాలయము, సూర్యాపేట ఫోన్ నం.9247720650,9492611057 లను సంప్రదించాలని పేర్కొన్నారు.