
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 సంవత్సరపు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల ముఖ్య ఎన్నికల అధికారిగా ఎర్రం విగ్నేష్ ఎన్నికల అధికారులుగా జి మధుసూదన్ గౌడ్, బిట్ల రవి లను నియమిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ రోజు బార్ అసోసియేషన్ హాల్లో నియామక పత్రాలు అందజేశారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కోట ఆవరణంలో గల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేేకరు కసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 21 శుక్రవారం రోజు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ ఇతర సభ్యుల సమక్షంలో హైదరాబాద్ లో అసోసియేషన్ అధ్యక్షుడు తొ జరిగిన సమావేశంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులను నియమిస్తూ జరగబోయే ఎన్నికలను షెడ్యూల్ రీ షెడ్యూల్ చేస్తూ ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికల నిర్వహించాలని ఉత్తరులను జారీ చేసినట్లు పేర్కొన్నారు బార్ కౌన్సిల్ కు నిజామాబాద్ అసోసియేషన్ మధ్య సమాచార లోపంతో అడా కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఎన్నికలు పూర్తిగా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని ఎన్నికల అనంతరం నూతన కార్యవర్గం వివరాలను రాష్ట్ర బార్ కౌన్సిల్ సమర్పించాలని బార్ అసోసియేషన్ ను కోరారు తెలిపారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల నియమ నిబంధన కనుగొనంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు జిల్లా కోర్టు ఆవరణంలోని బార్ అసోసియేషన్ లో నిర్వహించబడతాయని బార్ అసోసియేషన్ న్యాయవాదులు పట్ల గౌరవం ఉన్నదని సభ్యులందరి సహకారంతో ఎన్నికలు నిర్వహిస్తామని కనుక న్యాయవాదులందరూ ఎన్నికల్లో పాల్గొని విజయవంతం చేయాలని జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యర్శి వసంతరావు ఉపాధ్యక్షులు ఉన్ని పెండెం రాజు కోశాధికారి ఎ దీపక్, గ్రంథాలయ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ సీనియర్ న్యాయవాదులు పడిగెల వెంకటేశ్వర్ శివాజీ భోస్లె రవి తదితరులు పాల్గొన్నారు.