– హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ ప్రకటన
హైదరాబాద్ : హైదరాబాద్ మహిళల జట్టు చీఫ్ కోచ్ విద్యుత్ జయసింహను తక్షణమే విధులను నుంచి తప్పిస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు ప్రకటించారు. అమ్మాయిలతో పాటు టీమ్ బస్లో వెళ్తూ విద్యుత్ జయసింహ మద్యం సేవిస్తూ కనిపించాడు. ఈ దృశ్యాలను మహిళా క్రికెటర్లు వీడియోలు తీసి మీడియాకు పంపించారు. హెచ్సీఏకు సైతం గుర్తుతెలియని ఈమెయిల్ నుంచి ఈ అంశంపై ఫిర్యాదు అందగా.. దానిపై దర్యాప్తునకు ఆదేశించారు. తాజాగా వీడియో ఆధారాలు బయటకు రావటంతో చీఫ్ కోచ్పై సస్పెన్షన్ వేటు వేశారు. భవిష్యత్లో విద్యుత్ జయసింహకు హెచ్సీఏలో ఎటువంటి బాధ్యతలు అప్పగించమని జగన్
తెలిపారు.