రాజకీయ పార్టీల నాయకుల అవగాహన కార్యక్రమం..

– ప్రజలు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి: డీఎస్పీ నాగేంద్ర చారీ..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండల పరిధిలో గల వివిధ రాజకీయ పార్టీ ల నాయకుల తో సోమవారం త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల పై అవగాహన కార్యక్రమం ను వేములవాడ డి ఎస్పీ నాగేంద్ర చారీ నిర్వహించారు.ఈ సందర్బంగా  డి ఎస్పీ నాగేంద్ర చారీ నాయకులను ఉద్దేశించి రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ప్రతీ ఒక్కరు ఎన్నికల నియమావళి ని అనుసరించి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించాలి అని కోరారు.గతం లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుటకు సహకరించిన విధంగా గానే రానున్న ఎన్నికలు కూడా సహకరించి ప్రతీ ఓటరు స్వచ్చందగా, నిర్భయంగా ఓటు వేయటం లో నాయకులు సహకరించాలి అని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో లో ఒకరి పై ఒకరు బేదాభిప్రాయాల కు పోకుండా సోషల్ మీడియా వేదికగా ఇతర పార్టీ ల గురించి కానీ నాయకుల గురించి కానీ  అభ్యంతకర పోస్టులు  పెట్టకూడదు అని హెచ్చరించారు.  ప్రతీ ఒక్కరు చట్టానికి లోబడి, ఎన్నికల నియమావళిని పాటించాలి  చట్ట పరిధి దాటితే కేసులు నమోదు చేస్తాము.  భవిష్యత్తు లో ఇట్టి కేసుల వల్ల ఇబ్బందులకు గురి కావద్దు అని కోరారు. ఈ కార్యక్రమంవేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ,రూరల్ ఎస్ ఐ మారుతీ మండలం లోని అన్ని రాజకీయ పార్టీ ల నాయకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love