నవతెలంగాణ అమరావతి: ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ నాయకులు సత్యప్రసాద్ లు సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు. అనంతరం సభాపతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు.