బీఎస్పీ పార్టీతోనే బహుజనుల అభివృద్ధి

–  బిఎస్పీ పార్టీ మహబూబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి శేఖర్
 నవ తెలంగాణ- నెల్లికుదురు:

ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను కలుపుకొని రాజ్యాధికారం చేపట్టిన బహుజన నాయకుడిని సర్దార్ సర్వాయి పాపన్న ను ఆదర్శంగా తీసుకొని బహుజన రాజ్యాధికారం చేపడతానే బహుజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని బి.ఎస్.పి పార్టీ మహబూబాద్ నియోజకవర్గ అభ్యర్థి శేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నకు, అంబేద్కర్ కు పూలమాలవేసి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జిల్లా కేంద్రంలో నామినేషన్ వేసే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనలమంత ఏకమై బహుజన అభివృద్ధి కోసం దాటపడుతూ బహుజనలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు ఐక్యమత్యంతో ఉండి బహుజన అభివృద్ధి మార్పు కోసే కృషి చేసే ఆర్ఎస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో నిలబడిన శేఖరు గెలిపించాలని ప్రజలను తెలిపారు. బీఎస్పీ పార్టీ గెలుస్తాని పేదల అభివృద్ధి మారుతుందని అన్నారు వివిధ పార్టీల నాయకులు వారి స్వార్ధ లాభాల కోసమే పనిచేశారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. ఈ ప్రాంత అభ్యర్థిని పోటీ చేస్తున్నందున అందరం కలిసి ఈ ప్రాంత వాసులను గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు దార్ల శివరాజ్ ఉపేందర్ చాణక్య తో పాటు నాయకులు ఉన్నారు.
Spread the love