విద్యార్థులకు మైక్ బాక్స్ ని అందించిన బక్కి వెంకటయ్య

నవతెలంగాణ – మిరు దొడ్డి 
ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురు వారం అక్బర్ పేట  మండలంలోని భూంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వెంకటయ్య మైక్ సెట్ ను అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతిలో ప్రతి విద్యార్థి రాష్ట్రంలో 100% ఉత్తీర్ణత. విద్యార్థులు మంచి ర్యాంకును తీసుకురావాలని సూచించారు. పాఠశాల ను స్వచ్ఛ పాఠశాలల తీర్చిదిద్ది విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love