కోర్టు ఉద్యోగిని సన్మానించిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు..

నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ కోర్టులో పనిచేస్తున్న ఉద్యోగి ఆరిఫ్ పదవి విరమణ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కోర్టు హాల్లో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గుడిసె సదానందం మాట్లాడుతూ ఉద్యోగికి పదవి  విరమణ అనేది తప్పనిసరి అని, ఉద్యోగిగా ఉన్నంతకాలం ఆరిఫ్  న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి సేవలు అందించడం జరిగిందని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపర్డెంట్ లు అంజయ్య, శ్రీనివాస్, బెంచ్ క్లర్క్ శ్రవణ్, మనోహర్ రెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్ గౌడ్, పొత్తూరు అనిల్ కుమార్, పిట్టల మనోహర్, పెంట రాజు ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, న్యాయవాదులు నక్క దివాకర్ ,నాగుల సంపత్,    బొజ్జ నరేష్, బొడ్డు గంగరాజు, గుజ్జే మనోహర్, శశిధర్, అశోక్, పద్మ, కోర్టు అటెండర్ సుంకి సత్యనారాయణ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love