బట్టు రామచంద్రయ్య జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం

– ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలయ్య.
 నవతెలంగాణ  – భువనగిరి
సామాజిక ఉద్యమ నాయకులు అలుపెరుగని పోరాట యోధుడు బట్టు రామచంద్రయ్య జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు.  శుక్రవారం భువనగిరి పాత వివేరా హోటల్ లో ఉద్యమ నాయకులు బట్టు రామచంద్రయ్య 75 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాజ్యాంగ రక్షణ – పౌర సమాజ పాత్ర అను అంశంపై సదస్సు జరిగింది. ఈసదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు భారత రాజ్యాంగం పట్ల గౌరవాన్ని కలిగిఉండాలన్నారు.
మన ప్రాంతంలో ఉద్యమాలకు ఊపిరి పోస్తూ ఇంత వయసులో కూడా ఇంకా కూడా ప్రజా ఉద్యమాలలో కొనసాగడమంటే అందరికి సాధ్యమయ్యేది కాదన్నారు. తన జీవితమంతా అట్టడుగు వర్గాలపక్షాన, కార్మికుల పక్షాన, అసంఘటిత రంగ ప్రజల పక్షాన నిరంతరం నిలబడి అండగ ఉండే వ్యక్తి అని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. మాజీ శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశ పౌరులందరు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అందుకోసం సామాజిక ఉద్యమనాయకులు కృషి చేయాలన్నారు.రామచంద్రయ్య గారి నుండి నేర్చుకోవలసిన అనేక విషయాలున్నాయని  అతని జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ బట్టు రామా చంద్రయ్య పేదల పక్షపాతి అని పేర్కొన్నారు దీర్ఘకాలం ప్రజా పోరాటాల్లో పాల్గొంటూ ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు ప్రజల పక్షాన నిలబడే వారిలో రామచంద్రయ్య ముందు వరుసలో ఉంటారని తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్ మాట్లాడుతూభారత రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉండడమే కాకుండా రాజ్యంపై పోరాడిన వ్యక్తి అని కొనియాడారు పేదలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను రాజకీయాలకతీతంగా పరిష్కరించే వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలోసురుపంగ శివలింగం, ఇటుకల దేవేందర్ , భాస్కర్ నాయక్, లు సమన్వయం చేయగా సీపీఐ జిల్లా కార్యదర్శి గోడ శ్రీరాములు, కౌన్సిలర్ పడిగేలా రేణుక ప్రదీప్,  ఏశాల అశోక్,  ఎండి ఇమ్రాన్ సీనియర్ జర్నలిస్ట్ కొలుపుల వివేకానంద ప్రొఫెసర్ డాక్టర్ బుచ్చయ్య, సామాజికోద్యమ నాయకులు బండారు రవివర్ధన్, దర్లాయి నర్సింగరావు,  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగారం అంజయ్య, అద్వకేట్ రహీం, కలకుంట్ల జయ, , బర్రె సుదర్శన్, మల్లారెడ్డి, శ్రీనివాసచార్యులు, కార్తాల శ్రీనివాస్, పాశం భాస్కర్,  సురారం జానీ, ఉప్పల శాంతి కుమార్,  అన్నంపట్ల కృష్ణ ,వనం రాజు, బట్టు నర్సింగరావు,  వడ్డేపల్లి దాస్ , బర్రె నగేష్ పాల్గొన్నారు.
Spread the love