రాయికల్ లో గుడుంబా తయారీ దారుల బైండోవర్

నవతెలంగాణ – రాయికల్
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధావన్ పల్లి గ్రామానికి  చెందిన మాలోతు లక్ష్మి,ధర్మాజిపేట కు చెందిన లావుడ్య నాగరాజు,లావుడ్య గంగాధర్ లను అబ్కారీ సి.ఐ సర్వేశ్వర్ శుక్రవారం తహశీల్దార్ అబ్దుల్ ఖయ్యూం ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. భవిష్యత్ లో గుడుంబా తయారీ చేస్తే లక్ష రూపాయలు జరిమానా, జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం రాష్టాన్ని గుడుoబా రహిత రాష్ట్రంగా చేయాలన్న నిర్ణయం లో భాగంగా బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. గుడుంబా తయారు చేసిన, సరాఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అబ్కారి ఎస్సై రాజేందర్, కానిస్టేబుల్ మమత,అబ్దుల్లా,సిబ్బంది తదితరులున్నారు.

Spread the love