![](https://navatelangana.com/wp-content/uploads/2024/02/yadagirigutta-10.jpg)
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో ప్రయాణిస్తాయని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్లు ఐలయ్య అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలం కుమ్మరిగూడెం, సీసీరోడ్డు పనులను బీర్ల ఐలయ్య కొబ్బరి కాయలు కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మంచినీటి వసతి, వీధిలైట్లు, సిసి రోడ్లు పూర్తిస్థాయిలో ప్రతి ఇంటికి అందేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కానుక బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.