- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
బీజేపీ ఆధ్వర్యంలో సంపర్కు అభియాన్ కార్యక్రమాల్లో బాగంగా సోమవారం నాడు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ పెద్ద తడగూర్ గ్రామాల్లో ఇంటింటా ప్రచారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తెప్పవార్ తుకారాం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ఇంటింటా ప్రచారంలో వివరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సుంకి అంజయ్య, బి జ్ఞానేశ్వర్, యోగేష్, లక్ష్మణ్ పటేల్, ఈరేషం, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -