కేంద్ర మంత్రులను సన్మానించిన బీజేపీ నాయకులు

నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, సికింద్రాబాద్‌ పార్లమెం ట్‌ సభ్యులు, కేంద్ర బొగ్గు, గనులశాఖ మం త్రి కిషన్‌ రెడ్డి, కరీంనగర్‌ పార్లమెంటు స భ్యులు, కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి బండి సంజరు కుమార్‌, మల్కాజి గిరి పార్ల మెంట్‌ సభ్యులు ఈటల రాజేందర్‌, మహ బూబ్‌ నగర్‌ పార్లమెంటు సభ్యులు డీకే అరు ణలను మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవ ర్గ సభ్యులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు ఎం.రవికుమార్‌ యాదవ్‌, గచ్చిబౌలి డివిజన్‌ కార్పొరేటర్‌ గంగాధర్‌ రెడ్డిలు ఢిల్లీలోని వారి నివాసంలో ప్రత్యక్షంగా కలిసి శాలువలతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలి పారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ అభ్యర్థులను కలువడం సం తోషంగా ఉందని కార్పొరేటర్‌ గంగాధర్‌ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి డివిజన్‌లో బీజేపీ మరింత బలపడడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాదాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ రాధాకృష్ణ యాదవ్‌, శేరిలింగంపల్లి కార్పొరేటర్‌ ఏల్లెష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love