- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: వాయువ్య పాకిస్థాన్లోని ఒక మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం 15 మంది మరణించగా, 56 మంది గాయపడ్డారని సమాచారం. పోలీసు కార్యాలయాలు ఉన్న భవనం సమీపంలో ఈ దాడి జరగడంతో, మరణించిన వారిలో ఐదుగురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఒక దుండగుడు మసీదులోకి దూసుకెళ్లేలా చేశాడని ఆ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ జుల్ఫికర్ హమీద్ తెలిపారు. ఈ దాడి కారణంగా పోలీస్ కార్యాలయాల బయటి గోడ కూలిపోగా, మసీదు తీవ్రంగా దెబ్బతింది. బాంబు దాడిలో గాయపడగా, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాడికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సింది.
- Advertisement -



