- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని పెరుమాండ్లపల్లిలో ఒకే రోజు అన్నదమ్ములు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సల్కూటి సింహారెడ్డి(68) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. ఆయన తమ్ముడు సల్కూటి లింగారెడ్డి(64) హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అన్న మరణవార్త విని తట్టుకోలేక పది నిమిషాల్లోనే మృతి చెందారు. సాయంత్రం ఇద్దరి భౌతికకాయాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
- Advertisement -



