నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన టెలికాం అడ్వైజరీ కమిటీ సమావేశంలో చైర్మన్ హోదాలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ శుక్రవారం పాల్గొన్నారు. తన తోపాటు టెలికాం అడ్వైసరీ కమిటీ సభ్యులు, జీఎం మెంబర్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు , డిప్యూటీ జనరల్ మేనేజర్ జగరాం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న సేవలు, ప్రజలు ఎదుర్కొంటున్న నెట్ వర్క్ సమస్యలు తదితర అంశాలపై చర్చించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.