విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి..

నవతెలంగాణ – పెద్దవూర
విద్యుత్ షాక్ తో ఓ ఎద్దు మృతి చెందిన ఘటన పెద్దవూర మండలం సంగారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.బాధిత రైతు  తెలిపిన వివరాల ప్రకారం సంగారం గ్రామానికి చెందిన కంచెర్ల రామచంద్రారెడ్డి ఉదయం తన వ్యవసాయ పొలాల మధ్య  తన వ్యవసాయ క్షేత్రంలో పొలల గట్టున మేస్తూవుంది.పొలం లో విద్యుత్ స్టంబాలు ఉండడం తో గాలికి స్థంబాలు కిందపడిపోయాయి.తీగలు ఎద్దు మీద పడిపోయాయి.మధ్యాహ్నం పొలం వద్దకు వచ్చి చూడగా ఎద్దు మీద కరంటు తీగలు పడి ఉండడం చూశానని ఎద్దు ఎంత లేపిన లేవలేదు. అప్పటికే చనిపోయి ఉందని తెలిపారు. తనకు వ్యవసాయ పనులకు ఉపయోగ పడుతుందని, వ్యవసాయం ఎలా చేసుకోలో అని కన్నీరు మున్నీరు గా విలపిస్తున్నాడు.సుమారు ఎద్దు విలువ రూ.50 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
Spread the love