Monday, July 27, 2026
E-PAPER
Homeబీజినెస్కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి

కాలేయ వ్యాధుల నివారణకు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్ తప్పనిసరి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కాలేయ వ్యాధులు మరియు నివారించదగిన మరణాలకు ప్రాథమిక కారణాల్లో ‘వైరల్ హెపటైటిస్’ ఒకటిగా కొనసాగుతోందని, ఇందులో భారతదేశపు వాటా గణనీయంగా ఉందని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పేర్కొంది. ‘ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం’ సందర్భంగా ప్రజలు ముందస్తు హెపటైటిస్ స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ మరియు సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలని కోరుతూ సంస్థ ఒక ప్రజా సలహాను జారీ చేసింది.

ఈ వైరల్ హెపటైటిస్‌ను ‘నిశ్శబ్ద వ్యాధి’గా పిలుస్తారని, ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే కాలేయం పూర్తిగా దెబ్బతినే వరకు ఇది శరీరంలో పెరుగుతుందని హెచ్చరించింది. రోగులు వైద్యులను సంప్రదించే సమయానికే ఈ వ్యాధి సిర్రోసిస్, కాలేయ వైఫల్యం లేదా కాలేయ క్యాన్సర్‌ దశకు చేరుకుంటుందని, అప్పుడు చికిత్స అత్యంత సంక్లిష్టంగా, సుదీర్ఘంగా మరియు ఖరీదైనదిగా మారుతుందని స్పష్టం చేసింది. అందువల్ల ముందస్తు స్క్రీనింగ్ మరియు సకాలంలో చికిత్స పొందడం ద్వారా తీవ్రమైన ప్రాణాపాయాన్ని నివారించవచ్చని సూచించింది.

జాతీయ, అంతర్జాతీయ ఆరోగ్య నివేదికలు మరియు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అంచనాల ఆధారంగా చూస్తే, భారతదేశంలో 2.9 కోట్ల మంది హెపటైటిస్ బి, 0.55 కోట్ల మంది హెపటైటిస్ సి తో సహా మొత్తం 3.5 కోట్ల మంది దీర్ఘకాలిక వైరల్ హెపటైటిస్ బారిన పడ్డారు. దీనివల్ల భారత్‌లో ప్రతియేటా సుమారు 1.23 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యధికంగా హెపటైటిస్ బి మరియు సి మరణాలు సంభవిస్తున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. వ్యాధి లక్షణాలు బయటపడకపోవడంతో చాలా మంది వ్యాధి నిర్ధారణ లేకుండానే గడుపుతున్నారు.

భారత ప్రభుత్వం ‘జాతీయ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్’ (ఎన్విహెచ్సిపి) కింద ఉచిత స్క్రీనింగ్ అందిస్తున్నప్పటికీ, వ్యాధి ముదిరిన తర్వాత కాలేయ మార్పిడి చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులలో సుమారు రూ.18-35 లక్షలు ఖర్చవుతుందని, ఆ తర్వాత జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. గత మూడేళ్లలో కాలేయ వ్యాధుల క్లెయిమ్‌లు రెట్టింపు కాగా, చికిత్స ఖర్చులు దాదాపు 100 శాతం పెరిగాయని సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా యువతలో 5–10 శాతం, టైర్-2, టైర్-3 నగరాల్లో 10–15 శాతం, అలాగే మహిళల్లో 10 శాతం మేర ఏటా క్లెయిమ్‌లు పెరుగుతున్నట్లు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ గుర్తించింది.

ప్రాణాంతకమైన ఈ వ్యాధిని అరికట్టేందుకు ముందస్తుగా హెపటైటిస్ బి, సి పరీక్షలు చేయించుకోవాలని, ముప్పు ఎక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలని సంస్థ సూచించింది. నవజాత శిశువులకు 24 గంటల్లోపు హెపటైటిస్ బి టీకాతో పాటు పూర్తి కోర్సును ఇప్పించాలి. దీర్ఘకాలిక హెపటైటిస్ ఏళ్ల తరబడి నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకూడదని తెలిపింది. వ్యాధి నిర్ధారణ జరిగితే, సూచించిన చికిత్సను పూర్తిగా తీసుకోవాలి.

హెపటైటిస్ సి నయమయ్యే వ్యాధి కాగా, హెపటైటిస్ బి ని నిరంతర వైద్యంతో సమర్థవంతంగా అదుపులో ఉంచవచ్చు. మధుమేహం, ఊబకాయం, ఫ్యాటీ లివర్ లేదా ఇతర జీవక్రియ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో క్రమం తప్పకుండా కాలేయ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. హెపటైటిస్ బి మరియు సి వ్యాప్తిని తగ్గించడానికి ఇంజెక్షన్లు, రక్తమార్పిడి, పచ్చబొట్లు వేయించుకునే సమయంలో సురక్షిత పద్ధతులు పాటించాలి. వాడిన బ్లేడ్లు, సూదులు లేదా సిరంజీలను ఇతరులతో పంచుకోకూడదు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రబలే హెపటైటిస్ ఏ మరియు ఈ ల బారిన పడకుండా ఆహారం, తాగునీటి శుభ్రత పాటించాలి. కాలేయాన్ని దెబ్బతీసే మద్యపానానికి దూరంగా ఉంటూ, సమతుల్య ఆహారం, వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. అధునాతన కాలేయ చికిత్సలు, మార్పిడి శస్త్రచికిత్సలకు లక్షల్లో ఖర్చవుతున్నందున, సరైన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని కలిగి ఉండటం ద్వారా ఆకస్మిక ఆర్థిక భారాన్ని ఎదుర్కోవచ్చు. 2030 నాటికి వైరల్ హెపటైటిస్‌ను నిర్మూలించాలన్న భారత లక్ష్యానికి అనుగుణంగా, వ్యాధి నివారణపై అవగాహన పెంచేందుకు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుబడి ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రిటైల్ విభాగంలో ఆరోగ్య బీమా, టాప్-అప్ కవరేజ్, పర్సనల్ యాక్సిడెంట్, మ్యాటర్నిటీ, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్‌నెస్ కవరేజీలతో పాటు, కార్పొరేట్ సంస్థలకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్, గ్రామీణ మార్కెట్లకు మైక్రో ఇన్సూరెన్స్ ఉత్పత్తులను మరియు సమగ్ర వెల్‌నెస్ సేవలను అందిస్తున్న ప్రత్యేక ఆరోగ్య బీమా సంస్థ. వినియోగదారుల కేంద్రంగా సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ఈ సంస్థ అత్యుత్తమ కస్టమర్ సేవలను, వినూత్న ఉత్పత్తులను అందిస్తోంది.

డిసెంబర్ 2025లో జరిగిన ఈటీ నౌ ఇన్సూరెన్స్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2025లో హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ ‘స్మార్ట్ ఇన్సూరర్’ మరియు ‘సేల్స్ ఛాంపియన్’ అవార్డులను గెలుచుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -