హుస్నాబాద్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం హుస్నాబాద్ లోని ఐఓసి కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఐఓసీ కార్యాలయంలో ఆర్ డి ఓ రామ్మూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత జాతీయ జెండా ఆవిష్కరించి పట్టణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఆర్ ఐ రాజు నాయక్, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు బోజు రమాదేవి రవీందర్, బొజ్జ హరీష్,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love