బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ కార్యాలయంలో బిజెపి సూర్యాపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పలస మహాలక్ష్మి  జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని బిజెపి సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.ఆనాడు సుష్మా స్వరాజ్ పార్లమెంట్ లో చేసిన పోరాటం కారణంగానే తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది అని తెలిపారు.కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలి అని ఆ సామాజిక న్యాయం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా, జిల్లా అధికార ప్రతినిధి పలస మల్సూర్ గౌడ్, జిల్లా కార్యదర్శులు సలిగంటి శ్రీనివాస్, సంద్యాల సైదులు, మాజీ కౌన్సిలర్ రంగినేని లక్ష్మణరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి తోనకునూరి సంతోష్ కుమార్, జిల్లా నాయకులు నూకల శైలేందర్, మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ సలీం పాషా తదితరులు పాల్గొన్నారు.
Spread the love