ఎస్బీఐ కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు..

నవతెలంగాణ-హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును కేంద్రం ప్రతిపాదించింది. ఎస్బీఐలోని మరో ఇద్దరు ఎండీలు అశ్వినీ కుమార్ తివారీ, వినయ్ టోన్స్ పేర్లనూ పరిశీలించిన కేంద్రం చివరికి శెట్టిని ఖరారు చేసింది. ఆగస్టు 28న పదవీ విరమణ పొందనున్న ప్రస్తుత ఛైర్మన్ దినేశ్ ఖరా స్థానాన్ని శ్రీనివాసులు భర్తీ చేయనున్నారు. కాగా శ్రీనివాసులు శెట్టికి ఎస్బీఐలో 36ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది.

Spread the love