సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చండూర్ కాంగ్రెస్ నేతలు

నవతెలంగాణ – చండూరు
తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని బుధవారం చండూరు కాంగ్రెస్ మండల అధ్యక్షులు  కోరిమి ఓంకారం, (టస్మా జిల్లా అధ్యక్షుడు  కోడి శ్రీనివాసులు, కావలి ఆంజనేయులు,  పట్టణ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్  ,ఎంపీటీసీ పల్లె వెంకన్న,దోటి వెంకటేష్, మునుగోడు  ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీగా చమల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపు కు కృషి చేస్తామని సీఎం కు మాటిచ్చారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి నివాసంలో భువనగిరి ఎంపీ గెలుపు పై  సమావేశం నిర్వహించారు.(టస్మా జిల్లా అధ్యక్షుడు  కోడి శ్రీనివాసులు, సీఎంకు  2024 డైరీ, క్యాలెండర్ ను అందజేశారు.  ఈ కార్యక్రమంలో  గండూరి  జనార్ధన్, గంట సత్యం, నల్ల గంటి మల్లేష్, తదితరులు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Spread the love